పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత : సీఎం జగన్
పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ఇండిస్టియల్ కారిడార్, పోర్టులు, విమానాశ్రయాలపై సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. రెండున్నరేళ్లలో భావనపాడు, మచిలీపట్నం.. రామాయపట్నం పోర్ట్ల నిర్మాణం పూర్తి కావాలని స్పష్టం చేశారు. కొప్పర్తి పారిశ్రామిక క్లస్టర్పై ప్రత్యేక దష్టి పెట్టాలన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీచేశారు. పోలవరం నుంచి విశాఖకు పైప్లైన్ ద్వారా తాగునీటి సరఫరాపై డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. సంక్రాంతిలోగా శంకుస్థాపనలకు అధికారులు సన్నద్ధం కావాలని అప్రమత్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గౌతమ్రెడ్డి, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ పాల్గొన్నారు.