Bull Run – రెండో రోజూ లాభాల భాటలో స్టాక్ మార్కెట్…
ముంబై – దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజు లాభపడ్డాయి. ఈ ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే లాభాల్లోకి దూసుకుపోయాయి. చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగింది. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 629 పాయింట్లు లాభపడి 62,502కి పెరిగింది. నిఫ్టీ 178 పాయింట్లు పుంజుకుని 18,499కి ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ (2.79%), సన్ ఫార్మా (2.36%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.02%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.89%), విప్రో (1.85%).
టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-0.61%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.36%), ఎన్టీపీసీ (-0.03%).